ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశ్నించే గళాలపై జగన్ దమనకాండ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 12:57 PM

ఈనెల 28 నుంచి, ఉత్తరాంధ్ర సమస్యలపై టీడీపీ  చేపడుతున్న పోరుబాట కార్యక్రమాన్ని సీఎం జగన్, వైసీపీ మంత్రులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని టీడీపీ  ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్ అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్న వ్యవహారాలు బయటపడతాయనే ఈ కార్యక్రమాన్నిఅడ్డుకుంటున్నారని తెలిపారు. పోరుబాటకు బయలుదేరుతున్న టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, గౌతు శిరీష లాంటి నేతలను నిర్బంధించడాన్ని బట్టి చూస్తే జగన్ అరాచకపాలక స్పష్టమవుతోందన్నారు. ప్రశ్నించే గళాలపై జగన్ మోహన్ రెడ్డి పోలీసులతో చేయిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోరుబాటను విజయవంతం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa