ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్‌ నేరగాళ్లు పెన్షనర్లను టార్గెట్‌ చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 12:58 PM

సైబర్‌ నేరగాళ్ల పట్ల పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాలని, అనంతపురం పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దనగౌడ్‌ సూచించారు. గురువారం ఎన్జీఓ హోంలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో పెన్షనర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దనగౌడ్‌ మాట్లాడుతూ టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్‌ నేరగాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను టార్గెట్‌ చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే రుణాలు తదితర అంశాలపై సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపుతూ ఓటీపీల ద్వారా వివరాలు సేకరించి నగదును మాయం చేస్తున్నారన్నారు. వీటికోసం ఎస్‌బీఐ మెయిన బ్రాంచ వారు వెల్త్‌ హబ్‌పేరిట సేవలందిస్తున్నారన్నారు. ఈ హబ్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్ల ప్రమాదం తప్పించుకోవచ్చన్నారు. అనంతరం ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ బాలగణే్‌షను పెన్షనర్ల సంఘం నాయకులు మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప, సహాధ్యక్షుడు కలందర్‌, కోశాధికారి రామకృష్ణ, ఉపాధ్యక్షులు నారాయణ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa