పోలవరం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లడంలో వైసీపీ ఘోరంగా విఫలమైందని అనంతపురం టీఎనటీయూసీ జిల్లా అధికార ప్రతినిధి సిమెంట్ పోలన్న మండిపడ్డారు. అనంతపురం టీడీపీ కార్యాలయంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దళవాయి వెంకటనారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో 73 శాతందాకా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేశారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోగా పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అప్పటి మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆచూకీలేకుండా పోయాడన్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబు మాటలు చెప్పడం తప్పా చేసిందేమీ లేదన్నారు. సాక్షాత్తు సీఎం జగన అసెంబ్లీలో బల్లగుద్ది చెప్పినా ఫలితం లేదన్నారు. గత మూడున్నరేళ్లల్లో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. వైసీపీ పాలకులు తమ వైఖరిని మార్చుకోకపోతే భవిష్యతలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa