విశాఖ లో విజయసాయిరెడ్డి దోపిడీకి హద్దే లేదని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. విశాఖలో రుషికొండ వద్ద నిరసనలకు టీడీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనికి వెళుతున్న బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అవినీతి చూసి ప్రజలు భయపడిపోతున్నారన్నారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా తనను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో మైనింగ్, గంజాయి మాఫియాదే రాజ్యమన్నారు. జగన్ , విజయసాయి రెడ్డి కనుసన్నల్లోనే దోపిడీ జరుగుతోందన్నారు. తాము వెళితే ఇదంతా బయటకు వస్తుందని భయ పడ్డారన్నారు. గతంలో వైఎస్ హైదరాబాద్ వెళ్లాలంటే పాస్ పోర్ట్ కావాలని అన్నారని.. ఇప్పుడు విశాఖపట్నం వెళ్లాలంటే తమకు పాస్ పోర్ట్ కావాలా అని బుద్దా వెంకన్న జగన్ను ప్రశ్నించారు. తాము జగన్ చర్యలకు భయపడేది లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే మోసాలు ప్రజలకు అర్థం అవడంతో.. తన పని అయిపోయిందని తెలిసే జగన్ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడని బుద్దా వెంంకన్న పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa