పోలీసుల తీరుపై బాంబే హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఓ తొమ్మిదేళ్ల బాలుడిపై పోలీసులు కేసు పెట్టి... ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ ఘటనపై బాంబే హైకోర్టు పోలీసులపై అక్షింతలు వేసింది. జరిమానా కూడా విధించింది. తొమ్మిదేళ్ల బాలుడు... సైకిల్పై వెళ్తూ అనుకోకుండా ఓ మహిళను ఢీ కొట్టాడు. దాంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో.. పోలీసులు ఐపీసీ సెక్షన్-338 కింద కేసు నమోదు చేసి... ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసుపై విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ ఎస్ఎమ్ మోదక్ ఈ కేసును కొట్టివేశారు. ఆ యాక్సిడెంట్లో బాలుడికి కూడా గాయాలయ్యాయయని, వాటిని పరిగణలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది. అలాగే ఏడు నుంచి 12 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లల విషయంలో ఇలాంటివి నేరాలు కాదని సెక్షన్-83 నిర్దేశిస్తుందని జడ్జ్లు గుర్తు చేశారు. అంతేకాదు పోలీసులు చేసిన చర్య బాలుడి మనోభావాలను దెబ్బతీసిందని, తొమ్మిదేళ్ల పిల్లవాడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరైన చర్య కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఇది ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమని.. బాలుడిది ఏమి తెలియని వయస్సు అని పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించగా.. కోర్టు అతని వాదనతో అంగీకరించింది. కేసును కొట్టివేసింది. వయస్సును దృష్టిలో పెట్టుకోకుండా కేసు పెట్టడంపై విచారం వ్యక్తం చేశారు. మైనర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు పరిహారంగా పిటిషనర్కు రూ.25 వేలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధ్యులైన పోలీసు అధికారుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయవచ్చని కోర్టు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa