క్షణం క్షణం రగిలిపోతున్న మూడో రోజు మహాధర్నా రాంబిల్లి మండలం నావిల్ బేస్ వద్ద కొనసాగుతుంది మహా ధర్నా. ఈ ధర్నాలో వేలాదిమంది ప్రజానీకం పాల్గొని మా సమస్యలన్నీ తక్షణమే క్లియరెన్స్ అవ్వాలి అని అధికారులు లేదు మండిపడుతున్నారు. గత 15 సంవత్సరాల నుండి అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు ఏ రీతిగా స్పందించడం లేదు నావిక దళం 15 సంవత్సరాల నుండి అనేకసార్లు లోపలికి వెళ్లకుండా ఆపడం మత్స్యకారులందరిని భయపట్టించడం జరుగుతుంది సమస్యలు పరిష్కారం జరగట్లేదు అందువల్ల చేయడం జరుగుతుంది తక్షణమే మా సమస్యలన్నీ క్లియర్ అవ్వాలి అని సుమారు 6000 7000 మంది ప్రజానీకం తెలియజేయడం జరుగుతుంది.
వీరి యొక్క డిమాండ్స్
1. మూడు గేట్లు వెంటనే తెరవాలి.
2. ఆధార్ కార్డుతో లోపలికి వెళ్ళాలి.
3. స్థానికులకు 70% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
4. కొత్తపేట చిన్న కలవలపల్లి కోప్పుకుంటపాలెం గోవిందపాలెం వాడ రాంబిల్లి నావి కాలనీ గ్రామాలన్నీ పిడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలి.
5. జెట్టి వెంటనే కట్టాలి.
6. పెండింగ్ ప్యాకేజీలన్నీ వెంటనే క్లియరెన్స్ అవ్వాలి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని తక్షణమే నెరవేర్చాలని జేఏసీ నాయకులు గ్రామ ప్రజానీకం తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa