సింహాద్రిపురం, మండలంలోని సుంకేసుల గ్రామం వద్ద గత నెల 26న మహబూబ్ బాషాపై జరిగిన హత్యాయత్నం కేసులో ఆజాం, సమీనా అనే నిందితులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. మహబూబ్బాషా అతని భార్య సమీనాతో కలసి గత నెల 26వ తేదీ సాయంత్రం ప్రొద్దుటూరు నుంచి మోటార్ బైక్పై సింహాద్రిపురం వస్తుండగా.. సుంకేసుల గ్రామం వద్ద సమీనా చేతిలోని బ్యాగు పడిపోయింది. ఈ విషయం భర్త మహబూబ్ బాషాకు తెలపడంతో అతను బైకును ఆపి బ్యాగు కోసం వెనక్కి వెళ్లాడు. అక్కడ ముసుగు ధరించిన వ్యక్తి మహబూబ్ బాషాపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. సమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. దర్యాప్తులో మహబూబ్ బాషాపై ఆయన భార్య సమీనా పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని తేలింది. సమీనాకు చిన్ననాటి స్నేహితుడు ఆజాం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం వుండటంతోనే మహబూబ్ బాషాను అడ్డు తొలగించుకునేందుకు పథకం వేశారని తేలడంతో వీరిద్దరని అరెస్టు చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa