జగన్ పాలన లో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు చురుగ్గా ఉండి పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. నవరత్నాల పేరుతో ప్రజలను భ్రమల్లోకి నెట్టి జగన్ అధికారంలోకి వచ్చాడన్నారు. వైసీపీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం వస్తే పన్నులు ఎత్తేస్తానని చెప్పిన జగన్ రెట్టింపు వసూలు చేస్తున్నాడన్నారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ది చేసే నాయకున్ని ఎన్నుకొని ఓటు వేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్దిచెప్పే సమయం త్వరలోనే ఉందని అందుకు ప్రజలు సిద్దంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి, ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్, జిల్లా కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వరెడ్డి, నిర్మామహేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ సామంతపూడి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు నరేష్, జ్యోతి మల్లిఖర్జున, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa