కార్తీక సోమవారం నాడే పౌర్ణమి కూడా రావడం తో పేరాల శివాలయంలో తెల్లవారుజామున నాలుగు గంటలకే అభిషేక కార్యక్రమాలు జరిగాయి. ఆలయ అర్చకుడు కారంచేటి నగేష్ కుమార్ శాస్త్రోక్తంగా ఈ అభిషేకాన్ని జరిపించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. కాగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ మేనేజర్ శివనాగదాసు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ రాత్రికి జ్వాలాతోరణం కార్యక్రమం ఉంటుందని అర్చకుడు నగేష్ కుమార్ చెప్పారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa