విజయనగరం పర్యటనకు వెళ్లిన పవన్ అక్కడ అసలు ఏం చేసినట్లు. పవన్ కళ్యాణ్కు పరిస్థితి చూస్తుంటే జగనన్న ఇళ్లు.. పవన్, చంద్రబాబు కన్నీళ్లు` మాదిరిగా ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. గుంకలాంలో పవన్ మాటలు, ప్రవర్తన, వింత చేష్టలు చూసిన తరువాత `జగనన్న ఇళ్లు.. పవన్, చంద్రబాబు కన్నీళ్లు` అనే ట్యాగ్ లైన్ పెట్టుకోవడం బెటర్ అని సూచించారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై ఏదో ఒక నెపం మోపేందుకు వీకెండ్లో గెస్ట్ ఆర్టిస్ట్గా ఏపీకి పవన్ వస్తున్నాడన్నారు. 21 లక్షల ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే చూడలేక పవన్కు కడుపుమంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంకలాంలో కూడా 12 వేల ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే ఏమీ జరగనట్టు చెప్తున్నాడు. కళ్లుంటే, సరిగా చూస్తే ఆ ఇళ్ల నిర్మాణం కనిపిస్తుంది అని మండిపడ్డారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa