ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆక్వా రైతుల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన టీడీపీ నేతలపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. ఆక్వాకు మద్దతు ధరపై మంత్రుల కమిటీ నిర్ణయించిన మొత్తం రూ.240 లను రూ.210 లకు తగ్గించడం సీఎం అసమర్ధతకు నిదర్శనమని విమర్శించారు. దీనిపై శాంతియుతంగా పోరాడుతున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa