ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం గొట్టుకూరు గ్రామంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం జరిగింది. వైయస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ' ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులు, పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రతి గడపకు వెళ్లి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను మాజీ ఎమ్మెల్యే వివరించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి వైయస్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa