టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ను తీవ్ర పదజాలంతో దుషిస్తూ, చంపుతామని బెదిరించిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, అతని సోదరుడు చంద్రశేఖరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు సోమవారం ఎస్పీ జీఆర్ రాధికను కలిసి ఫిర్యాదు చేశారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు టీడీపీ హయాంలో ఒప్పందం జరిగిందన్నారు. అప్పట్లో కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా పూర్తయిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖరరెడ్డి బెదిరింపులతో ఆ కంపెనీ తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయిందని ఆరోపించారు. దీనిపై చంద్ర బాబుతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించి, ఎమ్మెల్యే సోదరుల తీరుపై మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa