ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశం కోసం యాత్ర మొదలెట్టిన కర్ణాటక వాసి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 05, 2022, 04:59 PM

దేశంలో శాంతి నెలకొనాలని, ఘర్షణలు లేకుండా చూడాలని ప్రార్థిస్తూ కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ జిల్లా సిందనూర్‌ పట్టణానికి చెందిన విజయగోపాల్‌కృష్ణ సైకిల్‌పై యాత్ర చేపట్టారు. ఆదివారం ఆయన సైకిల్‌యాత్ర వాల్మీకిపురం చేరుకోగా స్థానిక పట్టాభిరామాలయంలో దర్శనం అనంతరం తిరిగి తన యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయగోపాల్‌కృష్ణతో మాట్లాడగా మార్చి 11వ తేదీ సిందనూర్‌లో ప్రారంభించిన సైకిల్‌యాత్ర 11 రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు షిరిడీ, నాసిక్‌, త్రయంబకేశ్వరం, గణాపూర్‌, తుల్జాపూర్‌, గుజరాత్‌ రాష్ట్రంలోని త్రివేణి, బాసర, నర్మదా నది, నాందేడ్‌, కాశి, ఆయోధ్య, ఆగ్రా, లక్నో, మధుర, పంజాబ్‌, హర్యానా, సింధూనది తదితర ప్రాంతాలలో పర్యటించానని చెప్పారు. ఆయా ప్రాంతాలలో ప్రముఖ ఆలయాల దర్శనం చేసుకున్నానని తెలిపారు. ఆదివారం ఉదయం వాల్మీకిపురం చేరుకున్న ఆయన స్థానిక పట్టాభిరామాలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. దేశం శాంతితో ఉండాలని ఈ యాత్రను ప్రారంభించానన్నారు. సుమారు 260 రోజులకుపైగా పలు ప్రాంతాలలో తిరిగినట్లు తెలిపారు. దేశంలో ఎలాంటి మత ఘర్షణలు, విద్వేషాలు లేకుండా చూడాలని వేడుకుంటూ తాను సైకిల్‌యాత్ర సాగిస్తున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa