దర్శి పట్టణంలో బుధవారం యుటిఎఫ్ బలపరచిన పిడిఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి దర్శిలో పర్యటించి ఇంతవరకు నమోదు కాని ఓటర్లు డిసెంబర్ 9 లోపు అప్లికేషన్ పూర్తి చేసి, తహసీల్దార్ కార్యాలయంలో అందచేసి, తమ ఓటు నమోదు చేయించు కోవాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రవిశంకర్ ను కలిసి రిజెక్ట్ లిస్ట్ గురించి మాట్లాడారు. అర్హత కలవారికి ఓటు కల్పించాలని కోరారు. దీనికి డిటి సానుకూలంగా స్పందించి అర్హత కలవారికి ఓటు మిస్ కానివ్వమని చెప్పారు. ఆయన వెంట యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు ధనిరెడ్డి వెంకటరెడ్డి, రాజశేఖర్, దర్శి యుటిఎఫ్ అధ్యక్షులు మీనిగ శ్రీను, ప్రధాన కార్యదర్శి రామకోటిరెడ్డి, ట్రెజరర్ రాంమోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు వెన్నపూస రామిరెడ్డి, మల్లికార్జునరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa