ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు రామయ్యకు న్యాయం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 03:12 PM

రైతు రామయ్యకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పెనుకొండ సబ్ కలెక్టర్ కు వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ సోమందేపల్లి మండలం కావేటి నాగేపల్లి గ్రామానికి చెందిన పేద రైతు రామయ్య నాసిన్ సంస్థ నిర్మాణం కోసం భూసేకరణ సమయంలో తన భూమి ఇవ్వనని హైకోర్టు ను ఆశ్రయించడం జరిగిందని తెలిపారు.


నాసన్ సంస్థ ప్రతినిధులు రామయ్య కుటుంబాన్ని పోలీసులు ద్వారా నిర్బంధించి బలవంతంగా దౌర్జన్యంగా నిర్మాణ పనులు చేపడుతూ చిత్రహింసలు గురి చేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు హైకోర్టు ఉత్తర్వులు అమలు పరుస్తూ అక్రమ నిర్మాణ పనులను ఆపాలని మా కుటుంబానికి రక్షణ కల్పించాలని, హైకోర్టును సీసీ నెంబర్ 51483/120 22 ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. దౌర్జన్యంగా యధావిధిగా పనులు చేపడుతున్నారని తక్షణమే నిర్మాణ పనులని అపాలని డిమాండ్ చేశారు.


రైతు రామయ్య కుటుంబం కు అండగా ఉన్న సిపిఎం పార్టీ నాయకులు పనులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించి అక్రమంగా కేసులు బనాయించడం జరిగిందన్నారు. సబ్ కలెక్టర్ జోక్యం చేసుకుని చట్టం ప్రకారం హైకోర్టు ఉత్తర్వుల మేరకు కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడకుండా తక్షణమే నిర్మాణ పనులు ఆపి హైకోర్టు ఉత్తర్వులు అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ , సిఐటియు జిల్లా నాయకులు రఫీ గౌస్ లాజం, బాబా, రాజగోపాల్, చాంద్ బాషా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa