రాయలసీమ గర్జనతోనే జగనన్న ప్రభుత్వ పతనం ప్రారంభమైందని కర్నూలు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి అన్నారు. పట్టణంలోని క్రాంతినగర్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. క్లస్టర్ యూనిట్ సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రజలలో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూపాల్ చౌదరి మాట్లాడుతూ..... కర్నూలు గర్జనన అట్టర్ ఫ్లాప్ కావడంతో వైసీపీలో వణుకు మొదలైందని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఏవీ ముందుకు రావడం లేదని, యువత ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు ప్రజలపై చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. సర్పంచులు, కౌన్సిలర్లు నిధులు లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa