రాష్ట్రాన్ని పాలిస్తున్న సైకో ముఖ్యమంత్రి పాలనకు ప్రజలు తప్పక బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అనంతరము సైకిల్ రాజ్యం రావాలని పార్వతిపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బిలి చిరంజీవులు అన్నారు. మండలంలోని పెద్దింపేట గ్రామంలో గురువారం సాయంత్రం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఘనముగా నిర్వహించారు.
ఈ కార్యక్రమము మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెంకి వేణుగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పురవీధులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ. ఇంటింటికి వెళ్లి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అంటూ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అనంతరము ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన పోవాలంటే సైకిల్ రాజ్యం తప్పక రావాలని ప్రజలందరికీ సూచించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేపడుతున్న ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడుకు ప్రజలు విశేష స్పందన వస్తుందన్నారు.
రాష్ట్రంలో వైయస్సార్ పాలన పూర్తిగా గాడి తప్పిందని అందువలన మధ్యతరగతి కుటుంబీకులు నానా అవస్థలు పడుతున్నారని తెలియజేశారు. ఈ అరాచక పాలన పోవాలంటే మరల తెలుగుదేశం పార్టీని అత్యధిక సీట్లతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన సీనియర్ పార్టీ నాయకుడు సాంబమూర్తి, తట్టికోట ఉమామహేశ్వరరావు, క్లస్టర్ ఇన్చార్జులు జి బాబ్జి , ఎస్ విశ్వేశ్వర రావు, మిత్తు వలస గ్రామ సర్పంచ్ దూడి భాస్కరరావు, అరకు పార్లమెంటరీ కార్దేసి ఎం అప్పారావు, అరకు పార్లమెంటరీ ఎస్సీ సెల్ కార్యదర్శి గర్భపు ఉదయభాను, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెంకి రామ్మోహన్రావు మాజీ ఎంపీటీసీలు జి సింహాచలం ఎం చనమనాయుడు, జగదీశ్వరరావు , బి సింహాచలం , ఎస్ శివకుమార్, ఏ రవణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa