తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జనవరి మాసం కోటాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా, జనవరి నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవా టికెట్ల ఆన్ లైన్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12 ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 14న ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుందని వివరించింది. అనంతరం లక్కీ డిప్ ద్వారా టికెట్ల కేటాయింపు ఉంటుందని టీటీడీ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa