ఒక చాన్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన జగన్రెడ్డి నాలుగేళ్లుగా అన్ని వర్గాల ప్రజలను దగా చేశారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా, పెనమలూరు, తాడిగడప మునిసిపాలిటీ 27వ డివిజన్లో జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత తుఫాను సమయంలో జగన్రెడ్డి ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక, నిల్వ ఉంచుకోలేక సతమతమవుతున్నారన్నారు. పంట కోసుకునేందుకు ప్రభుత్వ అనుమతి కోసం సచివాలయాల చుట్టూ, ఆర్బీకేల చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చివరి గింజ వరకూ కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. సొంత పార్టీలోని బీసీ నాయకులను, బీసీ మంత్రులను అవమానాలకు గురి చేస్తున్న వైనాన్ని బీసీలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీసీలను తక్కువ చేసేలా మాట్లాడడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. తొంభై శాతం రాయితీపై బీసీ వర్గాలకు చేతి పనిముట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa