ఏపీకి ప్రత్యేక హోదా లేదని, పోలవరం నిర్మాణం ఇప్పట్లో పూర్తి కాదని కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సమాధానమివ్వడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణాలపై కేంద్ర వైఖరిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఎండగట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ద్రోహంపై ముఖ్యమంత్రి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రానికి దక్కాల్సిన వాటిపై కేంద్రంతో పోరుకు సమయత్తం కావాలని సూచించారు. కేంద్రానికి లొంగిపోవడం మానకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa