ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విచారణ జరపకపోవడం వినియోగదారుల హక్కులు కాలరాయడమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 12:46 PM

ఏపీఈఆర్సీ ఛైర్మన్‌ కు టీడీపీ నాయకులూ, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్  లేఖ రాశారు. ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరపాలని కోరారు. విచారణ జరపకపోవడం వినియోగదారుల హక్కులు కాలరాయడమే అని విమర్శించారు. గతంలో విచారణ బహిరంగంగా జరిగేదని... ఈ ఏడాది వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విచారణేంటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు వరకు విచారణలన్నీ బహిరంగంగానే జరుగుతున్నాయని తెలిపారు. ఏపీఈర్సీ మాత్రం వీడియోకాన్ఫరెన్స్‌కే పరిమితం కావడమేంటని నిలదీశారు. అన్ని కార్యాలయాలు ఏపీకి తరలివచ్చాయన్నారు. ఏపీఈఆర్సీ కార్యాలయం హైదరాబాద్‌కే పరిమితమైందని... ఏపీకి తరలించి వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని కేశవ్‌ లేఖలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa