ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోవులకు విజృభిస్తున్న వింత వ్యాధులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 12:46 PM

పులివెందుల పట్టణంలో వింత వ్యాధులు విజృస్తుండటంతో గోవులు గాయాల పాలవుతున్నాయి. ఇటీవల కాలంలో గాయాలపాలైన గోవుకు పశుసంవర్థకశాఖ వైద్యులు వైద్యపరీక్ష లు నిర్వహించడంతో లుంపి వ్యాధి అని తేలింది. ఈ వ్యాధి మనుషులకు సోకకపోయినా గోవులకు మాత్రం ప్రాణాంతకమని వైద్యులు తేల్చిచెప్పారు. సకాలంలో తగు వైద్యచికిత్సలు చేయించకపోతే వాటి ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదముందని కూడా వారు వెల్లడించారు.


గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లుగా పురాణాలు చెబుతున్నాయని హైందవులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విచిత్రమైన వ్యాధికి గోవులు తల్లడిల్లుతున్న విషయం స్థానికులు గమనించారు. గోవు శరీరంపై బొబ్బలురావడం, అవి పగిలి రక్తపుపండ్లుగా పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ వ్యాధి తీవ్రతరమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఈ వింతవ్యాధి పట్ల పశుసంవర్థక శాఖ స్పం దించకపోతే వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని పులువురు వ్యాఖ్యానిస్తున్నారు.


అంతర్జాతీయ పశు పరిశోదన కేంద్రం కూత వేటు దూరం లోనే ఉన్నా, పశు వైద్య కేంద్రాల ముందే వింత వ్యాధులు కనిపిస్తున్నా ఎటు వంటి ఉపయోగాలు గోమాతలకు కలగడం లేదంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యం గా పనిచేస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి వింతవ్యాధి నుంచి గోవులను రక్షించాల్సిన బాధ్యత పశుసంవర్థకశాఖ అధికారులపైనే ఉంది. ఆవులను నిర్లక్ష్యంగా రోడ్డు మీద వది లేసిన వాటి యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa