గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే సుదీర్రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ముద్దనూరు మండలంలోని కొర్రపాడు గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నామని, అర్హులైన అన్ని కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. గండికోట ముంపు గ్రామమైన కొర్రపాడులో నిర్వాసితులకు పరిహారం అందేలా చూడాలని, కొండపైకి పశువు లను మేపడానికి వెళ్లేటందుకు రహదారి నిర్మిం చాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భారతి, మండల వైస్ ఎంపీపీ పుష్పలత, పార్టీ మండల కన్వీనర్ శ్రీధర్రెడ్డి, పార్టీ నాయకులు లక్ష్మినారాయణరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి, వెంకటేష్, ప్రభాస్, ఓబయ్య, గోవర్ధన్ రెడ్డి, రామచంద్ర, ఆదినారాయణరెడ్డి, భాస్కర్రెడ్డి, వీరారెడ్డి, మునిరెడ్డి, కిట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa