తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం ఒక కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పట్టనుంది. శుక్రవారం శ్రీవారిని 48,929 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,322 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa