ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పెరిగిన ఆత్మహత్యలు: కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 21, 2022, 11:33 AM

గతంతో పోలిస్తే ఏపీలో ఆత్మహత్యలు పెరిగినట్లు కేంద్రం తెలిపింది. రోజువారీ కూలీల ఆత్మహత్యలు భారీగా పెరిగాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభలో వెల్లడించారు. ఏపీలో 2021లో 3,014 మంది రోజువారీ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. 2014తో పోలిస్తే కూలీల ఆత్మహత్యల సంఖ్య మూడు రెట్ల మేర పెరిగిందని వెల్లడించారు. గత ఐదేళ్లలో 6,475 మంది కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారని మంత్రి తెలిపారు. కూలీల ఆత్మహత్యలు గల మూడేళ్లలోనే దాదాపు 19శాతం పెరిగాయని ఆయన వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa