దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో సోమవారం నాటి లాభాల ర్యాలీ ఇవాళా కొనసాగుతోంది. ఉదయం సెన్సెక్స్ 336 పాయింట్ల లాభంతో 60,903 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 18,111 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.67 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, NTPC, పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్, టైటన్, SBI, విప్రో, మారుతీ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న జాబితాలో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa