ప్రజలందరికీ శుభాలు కలగాలని, ఈ నూతన సంవత్సరంలో కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి అభిలషించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం తెల్లవారుజామున తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని, జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని , రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డికి శ్రీనివాసుడు మరింత శక్తిని ప్రసాదించాలని అభిలసించారు. డిప్యూటీ స్పీకర్ వెంట శ్రీనివాసుని దర్శించుకున్న వారిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబల్ల శ్రీరాముల నాయుడు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం ఎల్ ఎన్ రాజు, విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం పాలకమండలి సభ్యులు ఎం కె బి, ప్రముఖ వ్యాపారవేత్త జి. కార్తీక్, ఆలవెల్లి మురళి, కరుణాకర్, దిలీప్ తదితరులున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa