కొద్దిరోజులుగా ఉక్రెయిన్పై క్షిపణుల వర్షం కురిపిస్తున్న రష్యా చర్యలను ఆదేశ సైనికులు దీటుగా తిప్పికొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాస్కో ఆక్రమిత మకివ్కా నగరంపై జరిపిన భీకర క్షిపణి దాడిలో.. 400 వరకు రష్యన్ సైనికులు మృతి చెందారు. మరో 300 మంది వరకు గాయపడినట్లు ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది. అయితే రష్యా తరపు స్థానిక పాలనాయంత్రాంగం ఈ విషయాన్ని కొట్టిపారేసింది. దాడి, ప్రాణనష్టం వాస్తవమేనని, అయితే ఆ స్థాయిలో మరణాలు లేవని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa