కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన ఖరారైంది. జనవరి 8న కర్నూలు, పుట్టపర్తిలో అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నెల 8న ఉదయం 11:15 గంటలకు కర్నూల్ లో అమిత్ షా బహిరంగ సభ జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకి పార్టీ కార్యకర్తలతో అమిత్ షా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి పుట్టపర్తిలో నిర్వహించే బహిరంగ సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. సాయంత్రం 4:30కి పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమాన్ని సందర్శించి, పుట్టపర్తిలో సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో అమిత్ షా భేటీ కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa