యర్రగుంట్ల పురపాలిక పరిధిలో రాత్రి సమయాలలో రోడ్ల వెంబడి ఫుట్ పాత్ ల పై నిద్రిస్తున్న అభాగ్యులకు మానవతా స్వచ్చంద సంస్థ ప్రతినిధులు దుప్పట్లను పంపిణీ చేశారు. మంగళవారం ఆర్టీసీబస్టాండు, రైల్వేస్టేషన్, రాణివనం, వేంపల్లె రోడ్డు, ముద్దనూరు రోడ్డు, కడపరోడ్డు, మార్కెట్ యార్డు, ఐసీఎల్ పరిశ్రమ, శ్రీ చౌడేశ్వరి మాత ఆలయం వంటి ప్రాంతాలలో చలికి గజగజ వణుకుతూ నిద్రిస్తున్న పేదలకు ఈ దుప్పట్లు ఎంతో ఉపకరించాయని చెప్పవచ్చు. మానవత ఉదారత పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నత వర్గాలు ఇలాంటి సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని వారు ఆకాంక్షించారు. ఇటీవలి కాలంలో మానవత స్వచ్చంద సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాల పట్ల పలువురు అభినందిస్తున్నారు. కాగా ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కల్లూరు గంగాధర్రెడ్డి (కెఓఆర్), సంస్థ ప్రతినిధులు రఘురామిరెడ్డి, జీరెడ్డి మల్లికార్జునరెడ్డి, షేక్ షర్ఫుద్దీన్, నాగెళ్ల విజయశేఖర్రెడ్డి, రాచమల్లు రాజవర్ధన్రెడ్డి, సానేపల్లి సుభాష్ రెడ్డి, ఆర్. శివకుమార్ రెడ్డి, బి. శివకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa