ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి మానవత్వం చూపారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో పలువురు అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి..తక్షణమే సాయం చేయాలని ఆదేశించడం, ఆ వెంటనే అధికారులు సాయం చేయడం చకచకా జరిగాయి. సీఎం వైయస్ జగన్ చూపిన మంచి తనానికి, మానవత్వానికి బాధిత కుటుంబాలు మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడుతున్నారు. ఎలమంచిలి పర్యటనలో అనారోగ్య బాధితులను ముఖ్యమంత్రి కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa