‘‘రాష్ట్రంలో అతి భయంకరమైన వలంటీరు వ్యవస్థను సీఎం జగన్ తెచ్చాడు. వలంటీర్లు కేవలం జగన్ సైనికులు. కాంగ్రెస్ కి రాష్ట్రంలో ప్రథమ శత్రువు జగన్. అనుభవరాహిత్య పాలనతో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు’’ అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. బుధవారం కడపలో మాట్లాడారు. జనవరి 26 నుంచి మార్చి 26 వరకు.. బీజేపీ, వైసీపీ వైఫల్యాల ను ఎండగడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పాదయాత్రలు చేస్తామన్నారు. ‘‘రాష్ట్రంలో జగన్ సుమారు రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసి దివాలా దిశగా పాలన సాగిస్తున్నారు. బీసీ కుల గణన నిర్వహించాలి. జీవో నంబరు-1 అంటే ప్రశ్నించే ప్రతిపక్షాల, మీడియా గొంతు నొక్కడమే’’ అని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa