సంక్షేమ పథకాల పేరుతో కొందరికి ఈతకాయంత ఇచ్చి...సీఎం జగన్ తాటికాయంత లాగేస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. కృష్ణలంక పాత పోలీసు స్టేషన్ రోడ్డులో కృష్ణలంక కిరణా మర్చంట్స్ అసోసియేషన్ సెక్రటరీ తాడువాయి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గద్దె, ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... మద్యం వ్యాపారం, ఇసుక వ్యాపారం ఇలా అన్ని వ్యాపారాలు జగన్, ఆయన అనుచరులు, పార్టీ నాయకులే చేసుకొంటూ పోయి ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారన్నారు. కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ కార్యదర్శి సత్యనారాయణ, ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ప్రతి నెలా ఇద్దరికీ నిత్యావసర వస్తువులు ఇవ్వడంతో పాటు ప్రతి ఏడు దాదాపు 150 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం ముదావహమని గద్దె పేర్కొన్నారు. టీడీపీ నాయకులు వేములపల్లి రంగారావు, మల్లేశ్వరరావు, యలవర్తి సత్యం, పోడూరి పవన్, తవ్వా ప్రకాష్, మండవ రవికాంత్, రమాదేవి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa