ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లోనూ దొంగ ఓట్లతోనే మీరు గెలిచారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 02:43 PM

‘చంద్రబాబు దొంగ ఓట్లతో గెలిచారని అంటున్నావ్‌. నువ్వు, నీ తండ్రికి దొంగ ఓట్లతో గెలిచిన అనుభవం ఉండటంవల్ల అలా చెబుతున్నారేమో తెలియదు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లోనూ దొంగ ఓట్లతోనే మీరు గెలిచారా?’ అని ఎంపీ మిథున్‌రెడ్డిని ఎమ్మెల్సీ దొరబాబు ఆరోపణలు చేశారు. తమ నాయకుడికి దొంగ ఓట్లతో గెలవాల్సిన అంత దౌర్భాగ్యం పట్టలేదన్నారు. చిత్తూరు ఎంపీ ఉండగా రాజంపేట ఎంపీకి కుప్పంలో ఏం పనని ప్రశ్నించారు. కుప్పంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కుప్పం వచ్చి పోటీ చేస్తానంటున్నావ్‌. ఏం పెద్దిరెడ్డీ, పుంగనూరులో పోటీ చేయడానికి నీకు భయమేసిందా?’ అని రామచంద్రారెడ్డిని ఎద్దేవా చేశారు. పుంగనూరులో మంత్రి కుటుంబ సభ్యుల పేరుతో స్థాపించిన శివశక్తి డెయిరీకి పాలుపోసే రైతులకు అతి తక్కువ ధర చెల్లిస్తున్నారన్నారు. ప్రభుత్వం రూ.ఆరువేల కోట్ల ప్రజాధనాన్ని ఇచ్చి దత్తు తీసుకున్న అమూల్‌ డెయిరీ సహా జిల్లాలోని ఏ డెయిరీని కూడా నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వకుండా నియంత పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. పల్ప్‌ ఫ్యాక్టరీలకు సరుకు సరఫరా చేసే మామిడి రైతుకూ ధర లేకుండా చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో మామిడి రైతుకు సబ్సిడీగా ఇచ్చి కిలోకు రూ.2.50 ని ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇచ్చిన చిత్తూరు, రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో కోళ్లపరిశ్రమ అభివృద్ధికోసం ఫారాలనుంచి వచ్చే కోడిగుడ్లను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్‌వాడీలకు కొని సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు వ్యాపారుల నుంచి ఎందుకు కొంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఈసారి చంద్రబాబుకు లక్ష మెజారిటీ ఖాయమని స్పష్టం చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa