ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయాలలో ప్రారంభమైన ఆధార్ సేవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 05:30 PM

ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. ఐదు రోజుల పాటూ ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆధార్‌లో బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఐదు రోజులపాటు స్పెషల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19, 20, 21, 23, 24న సచివాలయాలు, వాటి పరిధిలోని స్కూళ్లలో ఈ క్యాంపులు నిర్వహిస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇంఛార్జ్ అధికారులు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.


ఈ ఐదు రోజులు మాత్రమే కాదు.. ఫిబ్రవరిలో 7 నుంచి 10 వరకు నాలుగు రోజులపాటు మరోసారి ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఈ క్యాంపుల ద్వారా ఆధార్‌ సేవలు పొందేలా తగిన ప్రచారం చేయాలని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌లకు సూచించారు. ఈ క్యాంపుల రోజుల్లో సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్లు పూర్తిగా ఆధార్‌ సేవలపై ఫోకస్ పెడతారు. బయోమెట్రిక్‌ వివరాల్లో ఇబ్బందులు రాకుండా అందరి ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాలు అప్‌డేట్‌ చేస్తోంది.


యూఐడీఏఐ కొత్త నిబంధనల ప్రకారం పదేళ్లలో కనీసం ఒకసారి బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్‌డేట్‌ చేసుకోనివారు రాష్ట్రంలో ఇంకా 80 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా వేశారు. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆధార్‌ అనుసంధానంతో అమలవుతున్నాయి. అలాగే బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. లబ్ధిదారుల నుంచి వాలంటీర్లు బయోమెట్రిక్‌ తీసుకొంటున్నారు. అందుకే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa