ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైకల్యం బారిన పడితే వారికి పరిహారం కింద రూ.10 లక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 05:30 PM

కల్లు గీసే సమయంలో ఎవరైనా కార్మికులు ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం బారిన పడితే వారికి పరిహారం కింద రూ.10 లక్షలు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో వైఎస్‌ఆర్‌ బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు.. అలాగే ఎక్స్‌గ్రేషియా రూపంలో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.5 లక్షలు చెల్లించనుంది.


అంతేకాదు కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తూ కార్మికులు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే.. వైఎస్సార్‌ గీత కార్మిక భరోసా పథకం కింద రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తారు. గతేడాదిఅక్టోబరు 31న జారీ చేసిన కల్లు గీత విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనగా.. తాజాగా ఈ పరిహారం మొత్తాన్ని శాశ్వత వైకల్యం బారిన పడిన వారికి కూడా వర్తింపజేస్తూ కొత్తగా విధానాన్ని సవరించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.


ప్రభుత్వం గతేడాది కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం.. 2022 నుంచి 2027 వరకు కల్లు గీత పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. కల్లుగీత లైసెన్సింగ్‌ విధానం పారదర్శకంగా జరిగేలా పాలసీని తయారు చేశారు. ఇప్పటికే పరిహారంపై క్లారిటీ వచ్చేసింది. అలాగే కల్లు రెంటల్స్‌‌ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది.


అలాగే గీచే వానికి చెట్టు పథకం, కల్లుగీత కార్మిక సొసైటీలు, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో షెడ్యూల్డ్‌ జాతుల వారు కల్లు గీసుకోవడం కోసం ఐదేళ్లకు లైసెన్స్‌ ఇస్తారు. కల్లు గీస్తూ ఎవరైనా కార్మికులు ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైతే ప్రత్యామ్నాయ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా తగిన శిక్షణ ఇస్తారు. వారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపిస్తారు. తాటి, ఈత వంటి చెట్లను పెంపకానికి చర్యలు తీసుకోనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa