మాజీ సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండల టీడీపీ కన్వీనర్ గోవిందరెడ్డి అన్నారు. ఓర్వకల్లులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ వైసీపీ పాలనపై వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ.... సీఎం జగన్ అవగాహన లోపంతో ప్రజలపై భారం పడేలా నిత్యా వసర సరుకుల ధరలు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్దీ విరుస్తున్నారని విమర్శిం చారు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ సీఎం జగన్ తెచ్చిన జీవో నెంబరు 1 కేవలం ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు అన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, అన్వర్బాషా, ఎల్లయ్య, ఎల్లారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అల్లాబాబు, అబ్దుల్లా, గౌస్, ఆదామ్, బత్తుల వెంకటరమణ, అయూబ్, శ్రీరాములు, యాసిన్బాషా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa