కడప జిల్లాలో జగన్ పాలనకు స్వస్తిపలికేందుకు తనతో పాటూ డీఎల్ రవీంద్రారెడ్డి, వరదరాజులురెడ్డి, హరినారాయణరెడ్డితో సహా అందరరూ సిద్ధంగా ఉన్నారని తాజాగా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నార. సీనియర్ నాయకులం అంతా.. త 2019 ఎన్నికల సమయంలో.. కడప జిల్లాతో పాటూ ప్రజలు ఏపీ ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగితే 151 సీట్లు ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు ప్రజలు ఇలాంటి పాలన 70 ఏళ్లలో ఎప్పుడూ లేదని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ సెక్రటేరియట్ మొహం చూడటం లేదు.. పాలన సరిగా లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో 10కి 10 సీట్లు ఇచ్చారని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. 2024 ఎన్నికల్లో సొంత జిల్లాలో జగన్ దెబ్బ తింటారని జోస్యం చెప్పారు. వైఎస్సార్సీపీ మునిగిపోయే నావ లాంటిదని.. జగన్ పాలనలో జనం విసిగిపోయారని, రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి పోయిందని ధ్వజమెత్తారు.
తాను ఇప్పటికే చంద్రబాబు, లోకేష్లను కలిశాను అన్నారు. తనతో పాటూ డీఎల్ రవీంద్రారెడ్డి చంద్రబాబుకు టచ్లో ఉన్నారని.. ఇప్పటికే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు ఇంఛార్జ్గా ఉన్నారన్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని.. టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుంది అంటున్నారు. చంద్రబాబు అనుమతిస్తే కమలాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తాను అన్నారు. నియోజకవర్గంలో ప్రజలతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. తాను కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమాను వ్యక్తం చేశారు.
మార్చిలో కమలాపురం నియోజకవర్గంలోని తన వర్గీయులతో మండలాల వారీగా సమావేశమై టీడీపీలో చేరుతామన్నారు వీరశివారెడ్డి. తనతో పాటు డీఎల్ రవీంద్రారెడ్డి కూడా టీడీపీలోకి వస్తారని చెప్పారు. గతంలో వైఎస్సార్సీపీలో తనను చేర్చుకునేందుకు ఒత్తిళ్లకు గురి చేశారని తెలిపారు. వీరశివారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆయన కాంగ్రెస్ హయాంలో కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విభజన తర్వాత అంతగా యాక్టివ్ లేని ఆయన.. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటున్నారు. మరి టీడీపీ అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa