ఉత్తమ సేవలు అందించినందుకు గాను ప్రభుత్వం గుర్తించిందని అవార్డు అందుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని పార్వతీపురం జిసిసి డివిజనల్ మేనేజర్ వి. మహేంద్ర కుమార్ విలేకరులకు తెలియజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం నాడు ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకొని చరవాణిలో విలేకరులతో మాట్లాడారు. గిరిజన సహకార సంస్థ సమస్యల పట్ల స్పందించి వేగవంతంగా వారి సమస్యలు పరిష్కరించినందుకుగాను తనను ప్రభుత్వం గుర్తించిందని ఆయన తెలియజేశారు. గిరిజన కార్పొరేషన్ శాఖలో పేరుకుపోయిన సమస్యలను కొద్ది నెలల్లో సరిచేసి పరిష్కరించినందుకుగాను ప్రభుత్వం తనను గుర్తించిందని ఆయన తెలిపారు.
అభినందనలు వెల్లువ.... జిల్లాలో ఉత్తమ అధికారిగా అవార్డు ప్రకటించగానే జిల్లా నలుమూలల నుంచి ఉత్తమ సేవలకు గుర్తింపు ఇచ్చారని పార్వతీపురం జిసిసి డివిజనల్ మేనేజర్ వి. మహేంద్ర కుమార్ ని ప్రభుత్వాన్ని పలువురు కొనియాడారు. వి మహేంద్ర కుమార్ కు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం అవార్డు అందించారు. తక్కువ కాలంలో ప్రజాదరణ పొందిన అధికారిగా ఆయన మన్ననలు పొందారు. అవార్డు వచ్చినందుకు గాను ఆయనకు జిసిసి సిబ్బంది అభినందనలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa