టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్రకు ప్రజల బ్రహ్మరథం పట్టడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా స్పందన చూసి ఓర్వలేక పోలీసుల అండదండలతో పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పై కేసులు పెట్టడం వైసిపి ప్రభుత్వం చేతకానితనానికి ఇదొక నిదర్శనం అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. శనివారం పెనుకొండ పట్టణంలోని సవితమ్మ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సవితమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ప్రశాంతంగా లేదని లోకేష్ అధికారం ఆశించి యాత్ర చేయడం లేదని భావితరాల భవిష్యత్తు కోసం , యువత కోసం, ప్రజలకు భరోసా కల్పించేందుకు యువగళం పాదయాత్ర ప్రారంభించారన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ కార్యకర్తలు గాని ఎవరూ భయపడే ప్రసక్తే లేదని పాదయాత్రను విజయవంతం చేసి తీరుతామని వైసిపి ప్రభుత్వం పై మండిపడ్డ సవితమ్మ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాధవ నాయుడు, మాజీ జెడ్పిటిసి వెంకటరమణ , మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, త్రివేంద్ర నాయుడు, మారుతి వాసుదేవరెడ్డి, మంజు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa