సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి, నారా వారి కుటుంభాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇదిలావుంటే తారకరత్న చికిత్స పొందుతున్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే తారకరత్న భార్య అలేఖ్య, తండ్రి మోహన కృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు.. వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు కుప్పం వచ్చినప్పటికీ, అక్కడికంటే బెంగళూరులో ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ల సలహా మేరకు రాత్రి 2 గంటలకు ఇక్కడి తీసుకొచ్చారని పేర్కొన్నారు. తారకరత్నను కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స చేస్తున్నారని వివరించారు.
వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, కోలుకోవడానికి ఇంకా టైమ్ పడుతుందని తెలిపారు. వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. మరోవైపు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి, పరిస్థితి అంచనా వేస్తామని డాక్టర్లు చెప్పారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa