ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 08:22 PM

ఢిల్లీ వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ప్రత్యేక విమానం గన్నవరం విమానాశ్రయం నుంచి సాయంత్రం 5.03 గంటలకు బయలుదేరింది. అయితే కొద్ది నిమిషాల్లోనే విమానం తిరిగి వచ్చింది. సాయంత్రం 5.26 గంటలకు అత్యవసరంగా దిగారు. దీంతో సీఎం జగన్ గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి బయలుదేరారు. కాగా, సాంకేతిక సమస్యల కారణంగా సీఎం ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా తిరిగొచ్చినట్టు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa