వైసీపీలో ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాకారేపుతున్నాయి. ఇదిలావుంటే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ నిఘా పెడుతోందని.. వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై అధిష్టానం వేటు వేయగా.. కోటంరెడ్డిపై కూడా చర్యలు తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం నుంచి అనుమతి లేకుండానే అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ను పోలీసు అధికారులు ట్యాప్ చేయరు అని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు.
3 నెలల నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని.. ట్యాపింగ్ మొదలు పెట్టిన రెండు రోజుల్లోనే సమాచారం వచ్చిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు. తనవద్దకు వచ్చిన ఇంటెలిజెన్స్ సిబ్బంది వద్ద ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ను అధికారంలో ఉన్నవారు వాడతారని.. అలాంటిది అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టడమేంటి? అని ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోటంరెడ్డి తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి, ఇప్పుడు జగన్ వరకూ.. మూడు తరాలకు సేవ చేస్తున్నానని శ్రీధర్ రెడ్డి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. గతంలో ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయనను ఎదుర్కొని జగన్ ఓదార్పు యాత్రను పూర్తి చేయించగలిగానని.. పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి, స్పీకర్, ఉపసభాపతి, చీఫ్ విప్, విప్, చివరికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికీ అర్హుడిని కాకుండాపోయానా?.. అని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. నెల్లూరు రూరల్పై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa