భారత్ జోడో యాత్రను తన కోసం లేదా కాంగ్రెస్ కోసం చేయలేదు.. దేశ ప్రజల కోసం చేయలేదు.. ఈ దేశపు పునాదిని నాశనం చేయాలనుకునే భావజాలానికి వ్యతిరేకంగా నిలబడడమే మా లక్ష్యంగా చేపట్టానని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇదిలావుంటే ఓవైపు మంచు వర్షం, మరోవైపు గడ్డకట్టే చలి.. ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు సభ శ్రీనగర్లో జరిగింది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కశ్మీరీ అగ్రనేతలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. సంఘీభావం తెలియజేశారు. శ్రీనగర్ స్టేడియంలో తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జోరుగా మంచు కురుస్తున్నా లెక్క చేయకుండా రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘నేను ఈ యాత్రను నా కోసం లేదా కాంగ్రెస్ కోసం చేయలేదు.. దేశ ప్రజల కోసం చేయలేదు.. ఈ దేశపు పునాదిని నాశనం చేయాలనుకునే భావజాలానికి వ్యతిరేకంగా నిలబడడమే మా లక్ష్యం.. ప్రజల సహకారం చూసి నాకు కన్నీరు వచ్చింది. ఒక దశలో యాత్ర పూర్తి చేయగలనా అనుకున్నా.. చలిని సైతం లెక్కచేయకుండా ప్రజలు హాజరయ్యారు.. వారి సహకారం లేకుండా ఏ పనీ సాకారం కాదు..
జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలు, మహిళలు తమ బాధలు, సమస్యలను నాతో పంచుకున్నారు. ఈ పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పింది.. ప్రజల దీనస్థితి చూసి టీషర్టుతోనే యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను.. పాద యాత్రలో భాగంగా ఓ రోజు నలుగురు చిన్నారుల నా దగ్గరకు వచ్చారు.. వారు యాచకులు. వారి ఒంటిపై దుస్తులు కూడా లేవు. వారు చలికి వణికిపోతున్నారు. నాకు తెలిసి వారికి తగిన ఆహారం కూడా ఉండదు. వారు జాకెట్స్, స్వెట్టర్లు వేసుకోలేదు. అప్పుడే అనుకున్నా నేను కూడా వేసుకోకూడదని’ అని వెల్లడించారు. అలాగే కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని రాహుల్ హమీ ఇచ్చారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి గతేడాది సెప్టెంబరు 7న మొదలైన భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాల మీదుగా కశ్మీర్ వరకు సాగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa