సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలు ఉన్నాయని తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుమానం వ్యక్తం చేశారు. విశాఖపట్నం రాజధాని కాబోతోందని.. త్వరలోనే తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్రా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై పయ్యావుల కేశవ్ పై విధంగా స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పెంచడంతో సీఎం జగన్ ఉన్నఫలంగా విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన నేపథ్యంలో.. ఆయన సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారనే అంశాలు కీలకంగా మారాయన్నారు.
ఆ కాల్ డేటా వివరాలు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం జగన్.. విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతే రాజధాని అని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన అప్పీల్ పెండింగ్లోనే ఉండగానే.. సీఎం జగన్ ప్రకటన కోర్టు దిక్కరణ అవుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa