ఏపీ రాజధాని విషయంలో వైసీపీ నేత, టీటీటీ ఛైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్లోపే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు. గతంలో చెప్పినట్టుగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా న్యాయపరమైన సమస్యలను తొలగించుకొని.. విశాఖ నుంచే పాలన సాగించాలనే నిర్ణయానికి సీఎం జగన్ వచ్చారని వ్యాఖ్యానించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. మంగళవారం విశాఖపట్నంలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
విశాఖ నగరంలో ప్రభుత్వ కార్యాలయాలు చాలా ఉన్నాయని.. అవసరమైతే ప్రైవేట్ బిల్డింగ్స్ అద్దెకు తీసుకోవచ్చని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. భీమిలి రోడ్డులో ప్రభుత్వానికి చెందిన ఐటీ బిల్డింగ్ చాలా వరకు ఖాళీగా ఉన్నాయని.. ప్రస్తుతం ఐటీ కంపెనీలు లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి ఆ బిల్డింగ్లను వినియోగించుకోవచ్చని వివరించారు. వీఎంఆర్డీఐ బిల్డింగ్స్లోనూ కొన్ని ఆఫీసులు పెట్టుకోవచ్చని చెప్పారు. విశాఖ ఒక్కటే అన్ని విధాలుగా అభివృద్ధి నగరం కాబట్టే.. గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్టు వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం గురించి మాట్లాడిన గంటల వ్యవధిలోనే.. సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు యడం ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. తాను కూడా త్వరలోనే విశాఖకు తరలి వెళ్లబోతోన్నానని.. పెట్టుబడులు పెట్టడానికి అక్కడ అనువైన వాతావరణం ఉందని సీఎం జగన్ ఢిల్లీలో స్పష్టం చేశారు. దీంతో అమరావతి నుంచి సచివాలయం తరలి వెళ్లడం ఇక ఖాయమే అనే టాక్ వినిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa