గతంలో తనతో సహజీవనం చేసి ఈమధ్య వేరుగా ఉంటున్న వివాహితను బెదిరించి వివస్త్రను చేయబోయిన వ్యక్తిపై చీరాల రూరల్ పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమై ఇద్దరు కుమారులు కలిగాక భార్యాభర్తలకు గొడవలు వచ్చి విడిపోయారు. తదుపరి అదే గ్రామానికి చెందిన సింగరేసు కృష్ణారావుతో ఆమెకు పరిచయం ఏర్పడి కొద్ది కాలంగా వారు సహజీవనం చేస్తున్నారు. కృష్ణారావుతో కూడా విభేదాలు తలెత్తడంతో ఆమె అతని నుండి విడిపోయి పిల్లలతో వేరుగా ఉంటుంది. ఈ నేపద్యంలో సోమవారం సాయంత్రం కృష్ణారావు మద్యం సేవించి వచ్చి అత్యాచారయత్నం చేయడంతో పాటు తనతో సహజీవనాన్ని కొనసాగించకుంటే చంపేస్తానని బెదిరించగా బాధితురాలు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు రావడం చూసి తన పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఈపూరుపాలెం ఎస్సై జనార్ధన్ జనార్ధన్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa