బద్వేలు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ, యువ నాయకులు రితీష్ రెడ్డి, గోపవరం మండల జెడ్పిటిసి జయరామిరెడ్డి, ప్రముఖ కాంట్రాక్టరు ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు గోపవరం మండలంలోని శ్రీనివాసపురం లో ఇంటింటికి తిరిగి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కరపత్రాలను ప్రజలకు గోపవరం మండల నాయకులు రామానాయుడు, మరియు శ్రీనివాసపురం యూత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న ఖర్మను గురించి, ఈ ప్రభుత్వంలో ప్రజలు చూస్తున్న సమస్యల గురించి వివరణ కల్పిస్తూ అవగాహన కల్పించినట్లు గోపవరం సీనియర్ నాయకులు రామానాయుడు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa