సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం లీజు పద్ధతిలో రైతులిచ్చే భూములకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురంలో సీపీఎం ఆధ్వర్యంలో ‘సోలార్, విండ్ పవర్ వరమా..? శాపమా..?’ అంశంపై మంగళవారం సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ... విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కోసమని సేకరిస్తున్న భూములను లీజు పద్ధతిలో పెద్ద కంపెనీలకు కట్టబెడుతుండటం దారుణమన్నారు. ఆ భూములకు చట్టబద్ధత కల్పించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa